Thursday, March 28, 2024

పాక్ జలసంధి ఈదిన హైదరాబాద్ మహిళ ‌

హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల ప్రపంచ రికార్డు ను సృష్టించింది. పాక్ జలసంధిని 30 కిలోమీటర్ల మేర ఈదిన రెండవ మహిళ గా ఘనత సాధించంది. తమిళనాడు, శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలను పాక్ జలసంధి కలుపుతుంది. నిన్న ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరంలో తన సాహసకృత్యాన్ని ప్రారంభించిన శ్యామల ఏకబిగిన 13.43 గంటల్లోనే ఈది రామేశ్వరంలోని ధనుష్కోడి చేరుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఈతలో శిక్షణ ప్రారంభించారు. గతేడాది నవంబరులో గంగానదిలో 30 కిలోమీటర్ల దూరాన్ని 110 నిమిషాల్లోనే ఈది ఆరో స్థానంలో నిలిచారు. అలాగే, గతేడాది దక్షిణ కొరియాలోని గ్వాన్‌జులో జరిగిన ఫినా వరల్డ్ మాస్టర్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.  2012లో పాక్ జలసంధిని 12.30 గంటల్లోనే ఈదిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శ్యామల శిక్షణ పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement