Monday, April 29, 2024

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో దర్శనాలు రద్దు !!

గ్రేటర్ లో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ నగర్ దైవ సన్నిధాన పాలక మండలి చైర్మన్ మంచు మోహన్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాపి ఎక్కువ అవుతున్న కారణంగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధాన దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో భక్తులకు అనుమతి లేదని ప్రకటించారు. విశేష పూజా కార్యక్రమాలను మాత్రం ఆన్ లైన్ లో టికెట్ తీసుకున్న భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చునని మోహన్ బాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement