Monday, April 29, 2024

కొరటాల కు డెడ్ లైన్ పెట్టిన మెగాస్టార్…కారణం ఏంటో ?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, పాటకు విశేషమైన స్పందన లభిస్తోంది.

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కొరటాల కు ఓ డెడ్ లైన్ పెట్టాడట. ఆచార్య సినిమా షూటింగ్ ఏప్రిల్ ఆఖరికి పూర్తి చేయాలని చిరంజీవి చెప్పాడట. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ శివారులో నిర్మించిన టెంపుల్ టౌన్ సెట్ లో రామ్ చరణ్ పై పాటను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఇవ్వాలి నుంచే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సోమవారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ఆ పాటతో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలను కూడా తీయబోతున్నారట. ఇందుకోసం ఇప్పటికే నటీనటులకు రెడి గా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement