Friday, April 19, 2024

తిరుపతిలో సవాళ్లు.. జనం నవ్వులు..

తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుపతి ప్రచారంలో చంద్రబాబు, నారా లోకేష్ లు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వారికి కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయిన మాలోకం తిరుపతిలో సవాళ్లు విసురుతుంటే జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. సీఎం కొడుకై ఉండి, 3 శాఖలకు మంత్రిగా వెలగబెట్టినా ఓటమిపాలయ్యాడని విమర్శించారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తండ్రీకొడుకులు ప్రచారం చేసిన చోటల్లా పచ్చ పార్టీ గల్లంతైందని, ఇప్పుడు తిరుపతిలోనూ డిపాజిట్ కూడా దక్కదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

తనకు తాను ఓ అంతర్జాతీయ నేతలా ఫీలయ్యే చంద్రబాబు గల్లీ స్థాయికి పడిపోయాడని పేర్కొన్నారు. జగన్ దెబ్బకు గల్లీల్లో చక్కర్లు కొడుతున్నారని తెలిపారు. తిరుపతి వీధుల్లో చిట్టి నాయుడూ కామెడీ పండిస్తున్నాడన్నారు. ప్రత్యేక ఫైట్లు, ఫైవ్స్టార్ హోటళ్లు, లగ్జరీ కార్ల నుంచి తండ్రీకొడుకులను ప్రజలు నేలకు దించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement