Saturday, May 4, 2024

వీకెండ్‌ ట్రిప్‌లో బిల్లా-రంగా

టాలీవుడ్‌ లో టామ్ అండె జెర్రీ ఫ్రెండ్స్ గా పేరొందిన మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వీకెండ్ ట్రిప్ కి వెళ్లారు. వీర మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు వచ్చిన మళ్లీ సర్దుకుని స్నేహాన్ని కంటిన్యూ చేస్తుంటారు. అయితే తాము మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంటారీ లెజెండ్రీ యాక్టర్స్. అయితే తాజాగా వీరింద్దరు వీకెండ్ ట్రికి సిక్కిం వెళ్లారు. ఈ విషయాన్ని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు హీరో మంచు మనోజ్‌ ట్విట్టర్‌ లో ఫోస్ట్ చేశారు. “ఇద్దరు మాస్ట్రోలు సిక్కింకు శీఘ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు.. అదొక ఫైరింగ్‌ న్యూస్‌ అవుతుందని మీకు తెలుసు. చిరంజీవి అంకుల్‌..మీరు మాత్రమే నాన్నను వీకెండ్‌ క్విక్‌ ట్రిప్‌లో సిక్కింకు వెళ్లడానికని ఒప్పించగలిగారు. మిమ్మల్ని చూసి నేను ఈర్ష్య పడుతున్నాను. మీరు కలిసి అద్భుతమైన క్షణాలను గడపటం చాలా ఆనందాన్నిచ్చింది. హృదయం సంతోషంతో నిండిపోయిందని మంచు లక్ష్మి చిరంజీవి, మోహన్‌బాబు కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా షేర్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement