Thursday, May 2, 2024

వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి జావెలిన్ త్రో..

జావెలిన్ త్రో అనగానే మనకు గుర్తుకు వచ్చేది గోల్డెన్ బాయ్ నిరజ్ చోప్రానే.. టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో ఈ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు నిరజ్ చోప్రా. అయితే అప్పుడు జావెలిన్ త్రో అనగానే మెగాస్టార్ చిరంజీవి కూడా గుర్తుకువస్తున్నాడు. అవును చిరంజీవి జావెలిన్ త్రో విసిరిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. అదేంటి సినిమాలు తీసే చిరంజీవి ఎప్పుడు జావెలిన్ త్రో విసారడా అనే కదా మీ సందేహం. అవును నిజంగానే చిరంజీవి జావెలిన్ త్రో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది… కాని అది ఇద్దరు మిత్రులు సినిమాలోని ఓ సన్నివేశం. ఈ సీన్ లో చిరంజీవి జావెలిన్ స్టిక్ ను పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి విసురుతాడు..దీంతో ఆ స్టిక్ జడ్జీలు కూర్చున్న టేబుల్ మీద పడటంతో అందరూ అవాక్కవుతారు. దీంతో చిరంజీవి, సాక్సి శివానంద్ కలిసి విజయానందంతో సంబరాలు చేసుకుంటారు..

అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండియాకు ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టింది చిరంజీవే అని ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు…అంతేకాదు కొన్ని మీడియా సంస్థల్లో కూడా చిరంజీవి విసిరిన త్రో గురించే కథనాలు రాస్తూ.. ఇండియాకు ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టింది చిరంజీవి అని ఫన్నీగా కథనాలు రాసుకొస్తోంది.. మరి కొందరేమో ఇండియాకు ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టిన ఇతనికి 1 కోటి బహుమానంగా పంపిస్తాను అని కామెంట్ చేస్తున్నారు.

కాగా ఇటీవల గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాని అభినందించుకుంటూ ట్వీట్ చేశారు చేశారు చిరంజీవి. ‘ఇది భారత్‌కు నిజంగా ఒక అద్భుతమైన క్షణం. ఈ క్షణం రావడానికి 101 సంవత్సరాలు పట్టింది. నీరజ్ చోప్రా.. నీకు ఇదే నా సలామ్. నువ్వు చరిత్ర రచించడమే కాదు. చరిత్రను తిరగరాశావు’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

https://twitter.com/GabbbarSingh/status/1424299290696970243
Advertisement

తాజా వార్తలు

Advertisement