Monday, May 6, 2024

Megha Family : సింగిల్ ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ…..

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నవంబర్ -1న ఇటలీలో వివాహం చేసుకోనున్నారు. వధూవరులు ఇప్పటికే తమ అతిథులతో పాటు ఇట‌లీ టుస్కానీలో వెన్యూ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ వేడుక‌కు ఇప్ప‌టికే కొణిదెల‌- కామినేని కుటుంబాలు హాజ‌ర‌య్యాయి. మెగా హీరోల్లో ప‌లువురు ఇప్ప‌టికే వేడుక‌లో సంద‌డి చేస్తున్నారు. అందుకు సంబంధించిన హింట్ గా కొన్ని ఫోటోలు వెబ్ లో వైర‌ల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా రామ్ చరణ్- ఉపాస‌న దంప‌తులు తన కుటుంబంతో పాటు, అల్లు అర్జున్ అత‌డి కుటుంబం ఈ పెళ్లి వేడుకల‌కు హాజ‌ర‌య్యారు. నితిన్ -షాలిని స‌హా చాలా మంది విమానాశ్రయంలో కనిపించారు. ఈరోజు రామ్ చరణ్ భార్య ఉపాసన టుస్కానీ నుండి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసారు. ఉపాస‌న త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా రాసింది, టుస్కానీలో కొణిదెల కామినేని సెలవుదినం! హృదయమంతా ఒకే ఫ్రేమ్‌లో. ఈ చిరస్మరణీయ అనుభవానికి సాల్వటోర్ ఫెర్రాగామోకు ధన్యవాదాలు అని రాసారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement