Saturday, May 18, 2024

NZB:బిగాల అవినీతిని ప్రజలు మర్చిపోరు..

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 30(ప్రభ న్యూస్)
గత 9 సంవత్సరాల నుండి బిగాల అవినీతి తార స్థాయి కి చేరింది అని ప్రజలు ఎవరు మర్చిపోరని ఈ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్ రాకుండా ఓడగోట్టడం ఖాయమని బీజేపీ అభ్యర్థి దన్పాల్ సూర్యనా రాయణ అన్నారు. సోమవారం నగరంలోని 7 వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ సుక్క మధు తో కలసి బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి కి వెళ్లి ప్రచారం నిర్వ హించారు ఈ సందర్బంగా ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లా డుతూ ఎన్నికల సమయం లో నిజామాబాదు లో ఎన్నో హామీలు ఇచ్చి కనీసం తాగడానికి మంచినీటి ని అందించని స్థితి లో ఉందన్నారు.

ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ మీద భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీద అభిమానం వెలకట్టలేనిది అన్నారు కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృధి ని ప్రజలంతా గుర్తు చేస్తున్నారని అన్నారు. నా సేవ కార్యక్ర మాలని ప్రజలే గుర్తు చేస్తు న్నారన్నారు. మోదీ ఫ్రీ వాక్సిన్, ఉచిత రేషన్ అవస్ యోజన ద్వారా నిరుపేదల కి ఇస్తే ఇప్ప టి వరకు కట్టిన ఇండ్ల ని కూడా ఇవ్వలేకుండా పేదలకి పంచ కుండా బిగాల కమిషన్ ల కి కక్కుర్తి పడి ఇవ్వలెదని అని దుయ్యబట్టారు. నిజామాబాదు నగరం లో అభివృధి నోచు కోలేదన్నారు. కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్సన్ ల ఊసే లేద న్నారూ. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బీసీ ముఖ్య మంత్రి అని ప్రకటించగానే వారికి నిద్ర పట్టడం లేదన్నారు. బీజేపీ ఇచ్చినా మాటమీద నిలబ డుతుందన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోత్నాకర్ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు,అసంబ్లీ కన్వీనర్ పంచరెడ్డి లింగం,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బంటు రాము,జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, చందుపట్ల వనిత శ్రీనివాస్, మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్, బీజేపీ నాయకులు బట్టికర్ ఆనంద్, చిన్నకరి నరేష్,గిరిబాబు, పెద్ద ఎత్తున డివిజన్ ప్రజలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement