Monday, April 29, 2024

కేన్సర్‌తో పోరాడుతూ.. క‌న్నుమూసిన న‌టుడు

సుదీర్ఘ‌కాలంగా క్యాన్స‌ర్ తో పోరాడుతూ లుధియానా ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు బాలీవుడ్ సీనియర్ నటదర్శకుడు మంగళ్ ధిల్లాన్. ఆయన మరణవార్తతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ పలువురు నటీనటులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ నెల 18న ఆయన బర్త్ డే జరగాల్సి ఉండగా అంతలోనే ఆయన మృతి చెందడం చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలో జన్మించిన ఆయన ఢిల్లీలోని ఓ థియేటర్‌లో తొలుత పనిచేశారు. 1986లో టీవీ షో ‘కథాసాగర్’ ద్వారా ఇండస్ట్రీలోకి అడగుపెట్టారు. ఆ తర్వాత తిరుగన్నదే లేకుండా పలు షోలలో ఆయన కనిపించారు. ‘ఖూన్ భారీ మాంగ్’, ‘జక్మి ఔరత్’, ‘ట్రైన్ టు పాకిస్థాన్’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. చివరిసారి 2017లో వచ్చిన ‘తూఫాన్ సింగ్’లో మంగళ్ ధిల్లాన్ కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement