Wednesday, May 1, 2024

ఓటీటీలో ‘మామా మశ్చింద్ర’.. రిలీజ్ డేట్ ఫిక్స్

సుధీర్ బాబు హీరోగా తాజాగా థియేటర్స్ లో విడుదలైన సినిమా ‘మామా మశ్చింద్ర’. ఈ సినిమాలో మృనాలిని రవి, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించారు. నటుడు హర్షవర్ధన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. కాగా.. అక్టోబర్ 6న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో విడుదలైన రెండు రోజుల‌కే మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఓటిటి సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించేసింది. మామా మశ్చింద్ర డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. కాగా, అక్టోబర్ 6న రిలీజైన ఈ సినిమాని.. దసరా సందర్బంగా అక్టోబర్ 20 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement