Tuesday, May 21, 2024

మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టికి.. మాతృ వియోగం

మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టికి మాతృ వియోగం క‌లిగింది. ఆయ‌న తల్లి ఫాతిమా ఇస్మాయిల్ కన్నుమూశారు. ఆమె వ‌య‌సు 93సంవ‌త్స‌రాలు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా ఇస్మాయిల్‌ కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. ఫాతిమా ఇస్మాయిల్‌ మరణంతో మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ సెలబ్రెటీలు మమ్ముట్టి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. మమ్ముట్టి తల్లి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కొట్టాయం సమీపంలోని చెంపులో నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో రారాజుగా వెలుగుతున్నారు మమ్ముట్టి. తెలుగులోనూ స్వాతి కిరణం, సూర్య పుత్రులు, దళపతి వంటి పలు సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. మరో వారంలో విడుదల కాబోతున్న ‘ఏజెంట్‌’ సినిమాలోనూ మమ్ముట్టి కీలకపాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement