Friday, May 3, 2024

గెట్ వెల్ సూన్ బ్రదర్…ఎన్టీఆర్ పై ఆరోగ్యంపై మహేష్ ట్వీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ బ్రదర్…స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్ అంటూ ట్వీట్ చేశాడు మహేష్ .

మరోవైపు జాగ్రత్తగా ఉండండి… త్వరగా కోలుకోండి అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. అలాగే నారా లోకేష్ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement