Monday, April 29, 2024

‘సర్కారు వారి పాట’ షూటింగ్ రద్దు

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేశారట. హైదరాబాదులో ఈ నెల 15వ తేదీ నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉండగా ఇది క్యాన్సిల్ అయింది. ఈ షెడ్యూల్ ను 25 రోజుల పాటు చేయాలనుకున్నారు. కానీ వీలు చిక్కలేదు.

ఇక ఈ సినిమా బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహేష్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి రామోజీ ఫిలిం సిటీ లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మించారు. ఆ సెట్ లోనే ఈ ఎపిసోడ్లకు సంబంధించిన షూట్ చేయనున్నారని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement