Friday, April 26, 2024

MAA మా సభ్యులు గ్రూపులుగా విడిపోవటంపై విష్ణు ఆందోళన

మా అసోషియేషన్ ఎన్నికలు అక్టోబర్‌ 10న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తన ప్యానల్‌ సభ్యులను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మా’లో మార్పు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరికి మెడికల్‌ ఇన్సురెన్స్‌  కల్పిస్తాం అని విష్ణు అన్నారు.

‘మా’ ఎన్నికల్లో ఇంత పోటీ ఎప్పుడూ చూడలేదని, మా సభ్యులు గ్రూపులుగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తీరుపై ఎవరూ సంతోషంగా లేరని, ఎన్నికల గురిం‍చి మీడియా, సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధకరమన్నారు. ఇక తన ప్యానల్‌లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు.  అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించారు. 

ఇది కూడా చదవండి: సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన టీటీడీ..ఆందోళనకు దిగిన భక్తులు

Advertisement

తాజా వార్తలు

Advertisement