Thursday, April 25, 2024

హస్తినలో తెలంగాణ సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇలా..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో సీఎం కేసీఆర్ త‌న బృందంతో హస్తినకు పయనమైయ్యారు. శనివారం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ చర్చిస్తారు. అలాగే ఆదివారం( సెప్టెంబర్ 26) విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలోని స్కూళ్లపై కరోనా పంజా.. 19 మంది విద్యార్థులకు వైరస్

Advertisement

తాజా వార్తలు

Advertisement