Monday, April 29, 2024

కరోనాతో ప్రముఖ కమెడియన్ మృతి

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు. అందులో సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా ప్రముఖ తమిళ కమెడియన్ పాండు కరోనా కారణంగా మృతి చెందారు. పాండు వయస్సు 74 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండు… ఇటీవల కరోనా బారిన కూడా పడ్డారు.

దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతున్న పాండు గురువారం తుది శ్వాస విడిచారు. మరోవైపు ఆయన భార్య కూడా కరోనా బారిన పడ్డారు. తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్ మృతిచెందిన అతి తక్కువ రోజుల వ్యవధిలోనే మరో కమెడియన్ ను కోల్పోవడంతో తమిళ ఇండస్ట్రీకి విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement