Friday, April 26, 2024

ఆచార్య బ్యాలన్స్ సాంగ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ !!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిందని ఇంకా రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. కాగా తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒక సాంగ్ ని, 26 నుంచి ఆగస్టు ఎండింగ్ వరకు మరో సాంగ్ ను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. మొదటి సాంగ్ షూట్ లో రామ్ చరణ్, చిరంజీవి ,పూజా హెగ్డే పాల్గొననున్నారని తెలుస్తోంది. అలాగే లాంగ్ గ్యాప్ తరువాత మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement