Tuesday, March 19, 2024

నేడు పుంగ‌నూరులోని క‌ల్యాణ‌ వెంక‌ట‌ర‌మ‌ణ‌ స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వం

తిరుపతి : ఇటీవ‌ల టిటిడి ప‌రిధిలోకి తీసుకున్న పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ‌ వెంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆల‌యంలో నేడు ప‌విత్రోత్స‌వం జ‌రుగ‌నుంది. యాగశాలలో వైదిక కార్య‌క్ర‌మాలు, స్నపనతిరుమంజనం, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌డ‌తారు. సాయంత్రం యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాల అనంత‌రం రాత్రి 8 గంట‌ల‌కు పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా పవిత్రోత్సవం నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement