Thursday, April 25, 2024

యూట్యూబ్ లో అదరగొడుతున్న ‘కొండ పొలం’ ట్రైలర్!

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం కొండపొలం. క్రిష్ సినిమాను రూపొందించాడు. రకుల్ కథానాయికగా చేస్తోంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను యూ ట్యూబ్ లో వదలగానే ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. చాలా వేగంగా 3 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసేసింది. అడవి నేపథ్యంలో సాగే కథ. నల్లమల అడవిని నమ్ముకున్న కొంతమంది గిరిజనుల కథ. అడవిలో కూడా గొర్రెలు మేపుకోవడానికి అవకాశం లేని మనుషుల కథ. ఈ సినిమా కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని క్రిష్ ఈ ట్రైలర్ తోనే చెప్పేశాడు.

సాయిబాబు – రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ సమయంలో క్రిష్ ఈ సినిమా చేయడం గురించి విశేషంగా చెప్పుకున్నారు. అలాంటి ఈ సినిమాకి కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కోట శ్రీనివాసరావు .. సాయిచంద్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

ఇది కూడా చదవండి: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement