Wednesday, April 24, 2024

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

ఇండియాలో క‌రోనా క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 18,795 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,36,97,581 కి చేరింది. ఇందులో 32,9,58,002 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,92,206 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 179 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,47,373 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 26,030 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 1,02,22,525 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 87,07,08,636 మంది టీకాలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: మళ్లీ పెరిగిన పుత్తడి ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement