Sunday, April 28, 2024

ఇక హైదరాబాద్‌లో ఖుషి.. ఫైనల్​ షూటింగ్​ ఇక్కడేనట..

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. తొలి షెడ్యూల్‌ కశ్మీర్‌లో జరిపారు. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. వై రవిశంకర్‌, నవీన్‌ యేర్నేని నిర్మాతలు. గత నెల 23 తేదీ నుంచి కశ్మీర్‌లో ‘ఖుషి’ రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు పెట్టారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను షూట్‌ చేశారు. దీంతో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సందర్భంగా తదుపరి చిత్రీకరణ హైదరాబాద్‌లో మొదలవుతుంది.

ఆ తర్వాత వైజాగ్‌, అల్లెప్పిలలో షూటింగ్‌ చేస్తారు. ఇటీవలే విడుదల చేసిన ఖుషి టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిం ది. డిసెంబర్‌ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో ఇంకా జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శరణ్య నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement