Tuesday, March 26, 2024

మ‌ద్యం మ‌త్తులో రోడ్డుపై – వీరంగం సృష్టించిన మాజీ మంత్రి కుమారుడు

మ‌ద్యం మ‌త్తులో రోడ్డుపై న్యూసెన్స్ ని క్రియేట్ చేశాడు షాజాపూర్ కి చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి హుకుమా క‌రాడా త‌న‌యుడు రోహిత‌ప్ సింగ్. తన ఎస్వియు(SVU) కారులో మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీ కొట్టాడు. దినేష్ అహుజా అతడి అనుచరులతో కలిసి భూపాల్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోహితప్ సింగ్ మద్యం తాగుతూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడ‌ని బాధితులు తెలిపారు.. ఈ క్రమంలో రోడ్డుపై తన కారును ఢీకొట్టడంతో వారు అతడిని ప్రశ్నించగా.. రోహితప్ మరింత రెచ్చిపోయాడు.. బాధితులు తాము పోలీస్ స్టేషన్ కు వెళతాం, నష్టపరిహారం ఇవ్వాలని కోరడంతో.. అతను మరింత రెచ్చిపోయి మరోసారి దినేష్ కారును ఢీ కొట్టాడు. దీంతో దినేష్, అతని అనుచరులు రోహితప్ ను బయటకు దిగాలని కోరడంతో.. అతడు వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లి పోయాడ‌ట‌. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement