Tuesday, April 30, 2024

రవి తేజ కొత్త సినిమా – 30 రోజులే టార్గెట్ ?

క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు రవి తేజ. అదే జోష్ తో ఇప్పుడు ఖిలాడి సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు మరో కొత్త సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను రవితేజ ప్రారంభించాడు. నూతన దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. కాగా ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే సినిమా షూటింగ్ 30 రోజుల్లో పూర్తి చేయాలని రవితేజ కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది.

అయితే ఆ 30 రోజులకు గాను రవితేజ దాదాపు 8 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం.అంతే కాకుండా వైజాగ్, నైజాం ఏరియా రైట్స్ లో 50 శాతం వాటా కూడా అడిగారని తెలుస్తుంది. కాగా ఇందులో రవితేజ సరసన మజిలీఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను త్వరలనే వెల్లడించనునన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement