Saturday, May 4, 2024

కేజీఎఫ్2 తరువాత యశ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట ?

కే జి ఎఫ్ సినిమా తో స్టార్ హీరోగా మారిపోయారు హీరో యశ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా కన్నడ డైరెక్టర్ నార్తన్ తో యశ్ ఓ సినిమా చేయబోతున్నాడని గత కొంత కాలంగా వార్తలు నడుస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నార్తన్ సైతం ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. తాను చెప్పిన లైన్ యశ్ కు నచ్చిందని… ఇప్పుడు పర్ఫెక్ట్ కథ రెడీ అయిందని ఫైనల్ వెర్షన్ వినిపించడమే మిగిలిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కనుందని అందులో యశ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని హీరోయిన్ గా తమన్నాను సెలెక్ట్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ వార్తలపై యశ్ సన్నిహితులు మాట్లాడుతూ నార్తన్ తో సినిమా చేయబోతున్న మాట నిజమేనని… కానీ ఆర్మీ ఆఫీసర్ అనేది అవాస్తవమని తమన్నా కూడా ఇందులో హీరోయిన్ గా నటించడం లేదని చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి ఎవరో ఒకరు స్పందించే తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement