Friday, April 26, 2024

మరో వివాదంలో చిక్కుకున్న యాంకర్ ప్రదీప్

గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ టీవీ షో సందర్భంగా అమరావతి రాజధాని విశాఖ అంటూ యాంకర్ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రదీప్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్‌లో యాంకర్‌ ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే బుద్ధి చెబుతామని కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. అజ్ఞానంతో అమరావతి రాజధాని ఏంటన్న ప్రశ్న.. ప్రదీప్ సామాజిక బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టిందని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement