Tuesday, April 30, 2024

నితిన్ పవర్ పేట లేనట్టేనా ?

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఇటీవల రంగ్ దే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ప్రస్తుతం గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయాలని నితిన్ తండ్రి సినిమా నిర్మాత భావిస్తున్నాడట. ఈ సినిమా కన్నా ముందు రిలీజ్ అయిన రంగ్ దే, చెక్ సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో తరువాత చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నితిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే పవర్ పేట సినిమాను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా కథ ఈ పవర్ పేట కథకు కాస్త పోలికలు ఉన్నాయట. మరోవైపు రెండు భాగాలుగా తెరకెక్కించాలని దర్శకుడు కృష్ణచైతన్య భావించాడు. అయితే ఇటువంటి పరిస్థితులలో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడం కరెక్ట్ కాదని నిర్ణయానికి వచ్చాడట నితిన్. మరోవైపు వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా నితిన్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement