Monday, April 29, 2024

కీయరా అద్వానీ డిమాండ్ ఆ స్థాయిలో ఉందా ?

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అను నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ హీరోయిన్ కీయరా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో మెరిసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ ఇటీవల కాలంలో బాలీవుడ్ నాట మాత్రం వరుస సినిమాలతో హిట్లు కొడుతూ మంచి స్పీడ్ మీద ఉంది.

ఇక ఇప్పుడు మళ్లీ కియారా అద్వానీ టాలీవుడ్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం టాలీవుడ్ నిర్మాతలకు భయపెడుతోందట. ఒక సినిమాకు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తుందట ఈ అమ్మడు. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తీయబోయే చిత్రంలో కూడా హీరోయిన్ గా తీసుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కియారా నటించిన షేర్ షా… విడుదలకు సిద్ధంగా ఉంది. మరి కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరి రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చి ఈ అమ్మడిని టాలీవుడ్ నిర్మాతలు తీసుకు వస్తారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement