Saturday, May 4, 2024

నా మైండ్ లో మ‌హాభార‌తం ఉంది.. రాజ‌మౌళి

ఎప్ప‌టి నుండో మ‌హాభార‌తం సినిమాగా తెర‌కెక్క‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తునే ఉన్నాయి. అయితే మహాభారతాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఒక అద్భుత దృశ్య కావ్యంగా విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే కోరిక ఉన్నట్లు.. ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి ఇప్పటికే పలు సందర్భాలలో తన కోరికను బయటపెట్టారు. అయితే మహాభారతం సినిమాను ఎప్పుడు ఆయన తెరపైకి తీసుకొస్తార‌నే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం రాజమౌళి.. టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తన డ్రీం ప్రాజెక్టు గురించి అదిరిపోయే కామెంట్లు చేశారు.. ఇకపోతే భారతీయ ఇతిహాసం అయిన మహాభారతాన్ని తెరకెక్కించడానికి తమ వద్ద కొన్ని ప్లాన్స్ ఉన్నాయని..

అయితే ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఇంకా నిర్ణయించుకోలేదు అంటూ రాజమౌళి తెలిపారు.. అంతేకాదు బుల్లితెరపై ఇప్పటికే కొన్ని వందల ఎపిసోడ్స్ రూపంలో మహాభారతాన్ని ఆవిష్కరించారు. సిల్వర్ స్క్రీన్ పై ఎవరికి తోచిన విధంగా వారు అనేక భాగాలుగా ఆవిష్కరించారు. కానీ మహాభారతాన్ని ఎన్నిసార్లు చూసినా.. విన్నా చాలా అద్భుతంగానే ఉంటుంది.. మహాభారతం ఎంతో పెద్ద కథ.. చాలా సంక్లిష్టమైనది.. ప్రతి చిన్న పాత్రకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి కథను ఆవిష్కరించాలంటే పది భాగాలలో తెరకెక్కించాలి అంటూ రాజమౌళి తెలిపారు. ఇక మహాభారతం విషయంలో తన మైండ్లో విజన్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఎలా చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement