Thursday, April 25, 2024

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కార్తీ!!

కరోనా మహమ్మారిని అడ్డుకట్టవేసేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులు అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా కరోనా వ్యాక్సిన్ ను తమిళ స్టార్ హీరో కార్తీక్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటోని పోస్ట్ చేశారు.

ఆ ఫోటోలో కార్తీక్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించారు. అలాగే కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి కార్తీ తన అన్న సూర్యతో కలిసి తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే 400 మంది సినీ కార్మికులకు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement