రీసెంట్ గా అఖండ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలకృష్ణ.. తన నెక్ట్స్ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రానికి టైటిట్ గా వేటపాలెం అని అనుకుంటున్నారు. ఈ కథ రాయలసీమ నేపథ్యంలో కొనసాగనుంది. తండ్రీకొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఒక పాత్రలో ఫ్యాక్షన్ లీడర్ గాను .. మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా ఆయన కనిపించనున్నారట. ఆల్రెడీ పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, జనవరి 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతిహాసన్ అందాల సందడి చేయనుంది. మరో కథానాయికగా భావనను తీసుకున్నారట. ఇక నెగెటివ్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ లేడీ పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించనుంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..