Wednesday, April 24, 2024

‘వ‌ద్దు మామ‌య్యా’ అంటున్నా విన‌లే.. అక్క కూతురుతో ఆ ప‌ని.. తల్లి గమనించడంతో..

అక్క కూతురుపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడో దుర్మార్గుడు. వ‌ద్దు మామ‌య్యా అంటున్నా విన‌కుండా దారుణానికి పాల్ప‌డ్డాడో దుర్మార్గుడు. హైద‌రాబాద్ శివారులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. భర్త మృతితో పిల్లలతో పాటు పుట్టింటి వ‌ద్దే ఉంటోంది ఓ మ‌హిళ‌. అయితే అలుసుగా భావించిన ఆ మ‌హిళ త‌మ్ముడు.. అక్క కూతురిపై ఏడు నెలలుగా అత్యాచారం చేస్తూ వ‌చ్చాడు. ఈ మ‌ధ్యే ఆమెకు హెల్త్ బాగా లేక‌పోవ‌డంతో మెడిక‌ల్ చెక‌ప్ చేయిస్తే గ‌ర్భిణి అని తేలింది. హైదరాబాద్ శివారు గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు మైనర్ కుమార్తెలతో పాటు ఓ కుమారుడున్నారు. ఆమె భర్త పదేళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో తనకు అండగా ఉంటారని పుట్టింటికి వెళ్లింది. తల్లితో పాటు ఆమె సోదరులు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు.

స్థానికంగా కూలి పని చేసుకుంటూ తన పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో అక్క కూతురిపై కన్నేసిన ఆమె తమ్ముడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె శరీరంలో మార్పులను గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తమ్ముడే తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే అప్పటికే అమ్మాయి గర్భం దాల్చడంతో బాలిక అమ్మమ్మతో పాటు నిందితుడు కలిసి అబార్షన్ చేయించారు. దీంతో బాధిత బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement