Thursday, April 25, 2024

వదినతో ఎఫైర్ పెట్టుకుని.. భార్యను ఏం చేశాడంటే..

బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. వదినతో ఇల్లీగ‌ల్ ఎఫైర్ పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. భోజ్‌పూర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బధర్ గ్రామంలోని పొలంలో ఇటీవల ఓ వివాహిత డెడ్‌బాడీ కనిపించింది. సమాచారం తెలుసుకున్న‌ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మెడ దగ్గర గాయమైనట్లు కనిపించింది. దీంతో ఆమెను ఉరేసి చంపి మృతదేహాన్ని పొలాల్లో పడేశారని గుర్తించారు. ఆ మృతదేహం తన కూతురుదేనని అజయ్ అనే వ్యక్తి పోలీసులకు చెప్పాడు. అంతేకాకుండా త‌న‌కు అల్లుడిపై అనుమానం ఉంద‌ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో మ‌రింత ఎంక్వైరీ ముమ్మ‌రం చేసిన‌ పోలీసులు నిందితుడిని త‌మ‌దైన స్టైల్‌లో విచార‌ణ చేశారు. దీంతో అసలు విషయం బ‌య‌ట‌పెట్టాడు. హత్యకు గురైన మహిళ భర్త తన వదినతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడని తెలిసింది. ఆ విషయంపై నిలదీసినందుకే అతడు తన భార్యను చంపేసినట్లు తెలిసింది. భార్య అడ్డు తొలగించుకునేందుకు ఉరేసి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసినట్లు తెలిసింది. పోలీసులు వదిన, మరిదితో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని హత్య కేసులో అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement