Thursday, May 2, 2024

గుణ శేఖర్ కు కరోనా – భయంతో శాకుంతలం టీమ్

దేశంలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు నివేదాథామస్ తో పాటు కొంత మంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ కరోనా బారిన పడ్డారు.

దీంతో ఈ నేపథ్యంలోనే సమంత నటిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ కు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక గుణశేఖర్ కు పాజిటివ్ రావడంతో చిత్ర యూనిట్ అంతా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement