Monday, April 29, 2024

గుడివాడలో కొడాలితో హీరోయిన్ పాయల్ !!

గుడివాడ లో ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్ర షో రూమ్ లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి పాయల్ రాజ్ పుత్ పాల్గొన్నారు. పట్టణంలోని రైతు బజార్ సెంటర్ లో ఏర్పాటుచేసిన వస్త్ర దుకాణాన్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించగా, సినీ నటి పాయల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన పాయల్, షోరూంలో వస్త్రాలను పరిశీలించారు.

కళాకారులకు పుట్టినిల్లు అయిన గుడివాడ రావడం సంతోషకరమని పాయల్ అన్నారు. అనంతరం షోరూం వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులకు అభివాదాలు చేస్తూ, పాయల్ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement