Sunday, April 28, 2024

రెండో సినిమా విషయంలో వైష్ణవ్ ‘వై’ సైలెంట్ ?

ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు వైష్ణవి తేజ్. కరోనా తర్వాత రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు వైష్ణవ్. కొండపొలం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ రెండో సినిమా గురించి పెద్దగా ఎక్కడ టాక్ వినిపించట్లేదు. క్రిష్ కూడా ఈ సినిమాను లైట్ తీసుకున్నాడు. మరోవైపు వైష్ణవ్ తేజ్ వేరువేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ వైష్ణవ్ రెండవ సినిమా విషయంలో మాత్రం పెద్దగా క్రేజ్ లేదు. దీంతో ఈ సినిమాను థియేటర్లలో కంటే ఓటీటీ లో విడుదల చేయడం మంచిదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఓటీటీ సంస్థలతో నిర్మాతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ నిర్మాతలు అనుకున్న ధర మాత్రం రావడం లేదట. అందుకే ఎంతకు వస్తే అంతకు ఇచ్చేయాలని ప్రయత్నిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement