Thursday, April 25, 2024

రుయా ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మరణించిన ఘటన సీఎం జగన్ స్పందించారు. ఘటన తనను దిగ్భ్రాంతి గురి చేసిందని తెలిపారు. ఆయా కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సీఎం కలెక్టర్ ని ఆదేశించారు. ఘటనకు దారి తీసిన కారణాలను గుర్తించి, మళ్లీ పునరావృతం కాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆస్పత్రి వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కోరాడు. అవసరమైన సాంకేతిక సంస్థల సహాయం తీసుకుని రుయా లాంటి ఘటనలు తలెత్తకుండా చూడాలన్నారు. ఆక్సిజన్‌ సేకరణ, సరఫరాలపైనే కాకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వ్యవస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement