Friday, May 17, 2024

థియేటర్లలో కొత్త టైమింగ్ !!

కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే సినిమా థియేటర్లును రాత్రి 8 గంటలకు మూసివేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మిగిలిన మూడు షో లకు సంబంధించి టైమింగ్ లను మార్చారు యజమానులు. మార్నింగ్ షో ను ఉదయం 11 గంటలకు మొదలు పెట్టి మధ్యాహ్నం 1:30 వరకు వేయనున్నారు. అలాగే మ్యాట్నీ షో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు వరకు వేయనున్నారు .ఇక ఫస్ట్ షో ను ఐదు గంటలకు మొదలు పెట్టి రాత్రి 8 గంటలకు వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement