Thursday, May 2, 2024

‘ధూమ్‌’ డైరెక్టర్‌ సంజయ్‌ కన్నుమూత

ముంబై: హిందీ చలనచిత్ర పరిశ్రమకు ధూమ్‌ చిత్రంతో సరికొత్త ఒరవడిని తీసుకొనివచ్చిన ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గాధ్వి ముంబైలోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. మిలినియమ్‌ మొదట్లో హైటెక్‌ దొంగలుగా మారిన బైక్‌ రేసర్ల ఇతివృత్తంతో రూపొంది, 2004లో విడుదలై బాక్సాఫీసును కొల్లగొట్టిన ధూమ్‌ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.

హిందీ నటుడు అభిషేక్‌ బచ్చన్‌కు సరికొత్త స్టార్‌డమ్‌ను తీసుకొని వచ్చింది. అదే జోరుమీద ధూమ్‌ చిత్రానికి సీక్వెల్‌గా 2003లో ధూమ్‌ 2 చిత్రానికి దర్శకత్వం వహించారు. హృత్రిక్‌ రోషన్‌, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ లాంటి భారీ తారాగణంతో రూపొందిన ధూమ్‌ 2 సైతం అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేరే లియే చిత్రంతో 2000 సంవత్సరంలో తొలిసారిగా మెగాఫోన్‌ పట్టిన సంజయ్‌ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఆపరేషన్‌ పరిందే 2020లో విడుదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement