Tuesday, April 30, 2024

దేశ‌ముదురు రీ రిలీజ్.. ఫ్యాన్స్ అత్యుత్సాహం.. చిరిగిన తెర‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ‘దేశముదురు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. దీంతో ఆయా థియేటర్లలో స్పెషల్ షోస్ విజయవంతంగా పడ్డాయి. థియేటర్లలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరో సూపర్ హిట్ ఫిల్మ్ రీరిలీజ్ కావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నైజాంలోని ప్రధాన థియేటర్లలో ఒకటైన సంధ్య థియేటర్ లో దేశముదురు’ స్పెషల్ షోస్ పడ్డాయి. బన్నీ ఫ్యాన్స్ థియేటర్ ముందు ఏకంగా 41 ఫీట్ల అల్లు అర్జున్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. రీ రిలీజ్ కు గ్రాండ్ గా సెలబ్రేట్ ఉండేలా చూశారు. షో ప్రదర్శిస్తున్న సమయంలో ఫ్యాన్స్ ఉత్సాహంలో థియేటర్ తెర ముందుకు వెళ్లి డాన్స్ లు చేయడం ప్రారంభించారు. దీంతో తెర కుడి భాగం చివరిలో చిరిగిపోయింది. అంతలా బన్నీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement