Tuesday, May 21, 2024

తప్పులు అందరూ చేస్తుంటారు..ఇప్పుడు నేర్చుకున్న: అభిరామ్‌ దగ్గుబాటి

నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్‌ దగ్గుబాటి హీరోగా అరంగ్రేటం చేయనున్నాడు. అయితే తన పైన ఉన్న కొన్ని వివాదాలపై అభిరామ్ స్పందించాడు. తప్పులు అందరూ చేస్తుంటారని… తాను చేసిన కొన్ని తప్పులు బయటకొచ్చాయని అభిరామ్ తెలిపాడు. చేసిన తప్పుల నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని చెప్పాడు. ఎలాంటి పనులు చేయాలి? ఏమి చేయకూడదు? అనే విషయాలు తెలిసొచ్చాయని అన్నాడు. కష్ట సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని చెప్పాడు. తన సినీ కెరీర్ ప్రారంభం కావడానికి ముందే ఇలా జరిగిపోయిందని… అందువల్ల ఇంకెప్పుడూ అలాంటి తప్పులు చేయకూడని తెలుసుకున్నానని అన్నాడు.

దర్శకుడు తేజ తెరకెక్కించబోయే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నానని అభిరామ్ తెలిపాడు. తేజ సార్ సినిమాలో నటించబోతుండటం సంతోషంగా ఉందని… అయితే ఇదే సమయంలో కాస్త భయం కూడా కలుగుతోందని చెప్పాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన వర్క్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశానని తెలిపాడు. తనను హీరోగా మీరే పరిచయం చేయాలి సార్ అంటూ ఈ సినిమా షూట్ లో ఆయనతో అంటుండేవాడినని… తప్పకుండా నీ కోసం ఒక కథ రాస్తానని ఆయన చెబుతుండేవారని అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement