Sunday, April 28, 2024

అలియాభట్ కు కోర్ట్ నోటీసులు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. మాఫియా రాణి గంగుభాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న గంగుభాయ్ కతీయావాడి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథాంశం తన తల్లిని కించపరిచే విధంగా ఉందని గంగుభాయ్ కుమార్తె బాబు జీ షా పరువు నష్టం దావా కింద కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సమన్లు జారీ చేసింది . మే 21లోగా దీనిపై పూర్తి సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement