Thursday, May 2, 2024

Copy Paste – యాత్ర 2 లో భార‌తిని దించేశారు…

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన పొలిటికల్‌ డ్రామా యాత్ర. 2019లో రిలీజైన ఈ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ కు సీక్వెల్‌గా యాత్ర 2 వస్తోంది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించగా, కోలీవుడ్ హీరో జీవా సీఎం జగన్‌ పాత్రను పోషించనున్నారు. రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ స్నేహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాతి పరిణామాలు అంటే వైఎస్‌ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం తదితర అంశాలను యాత్ర 2 లో చూపించనున్నారు డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌.

తాజాగా ఈ మూవీ నుంచి వైఎస్‌ భారతి పుట్టిన రోజు సందర్భంగా యాత్ర 2 లో ఆమె క్యారెక్టర్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు’ అంటూ భారతి చెప్పే డైలాగ్‌ను ఈ పోస్టర్‌పై రాసుకొచ్చారు. అలాగే ‘ఒక నాయకుడు ఎదుగుదల వెనుక ఒక స్థిరమైన శక్తి’ అంటూ ఈ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు మేకర్స్‌
వైఎస్‌ భారతి పాత్రలో ప్రముఖ మలయాళ చెందిన కేతకి నారాయణ్ న‌టిస్తున్న‌ది… హిందీ, మరాఠీ ల్లోనూ నటించి మెప్పించిన ఆమె చిట్టి ఉమా కార్తీక్‌’ అనే ఓ తెలుగు లోనూ నటించింది. ఇప్పుడు యాత్ర 2లో వైఎస్‌ భారతి రోల్‌తో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనుంది. . ప్రస్తుతం భార‌తి ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అరే.. ఎవరామే? అచ్చం వైఎస్‌ భారతిలా ఉంది? బాగా సూటయ్యింది’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement