Thursday, May 16, 2024

Cinema: ప్రముఖ రచయిత పురాణపండ స్విచ్ ఆన్ తో నూతన చిత్రం ప్రారంభం

హైదరాబాద్ : ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ స్విచ్ ఆన్ చేయ‌గా… బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్ తో నూతన చిత్రం ప్రారంభమైంది. ఈసంద‌ర్భంగా పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఇవాళ వస్తున్న క్రొత్త తరం మేధస్సు, ఉత్సాహం, ప్రతిభ, సామర్ధ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. సినీ రంగంలోకి వస్తున్న కొత్త తరాన్ని కొందరు ఆక్షేపించి చులకనగా చూస్తున్నారన్నారు. తరువాత ఈ కొత్తవాళ్ళ సృజనాత్మక సామర్ధ్యాన్ని చూసి ఈ వెటకారపు రాయుళ్లు ముక్కున వేలేసుకుంటున్నార‌న్నారు. ఇది జరిగిన చరిత్ర.. జరుగుతున్న చరిత్ర.. జీవితంలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయొద్దు.. ఎవ్వరినీ అవమానించొద్దన్నారు.

నూతన నిర్మాణ సంస్థ ఆర్ట్ మేకర్స్ సమర్పణలో నూతన దర్శకుడు మద్దుల మదన్ కుమార్ దర్శకత్వంలో కుమారి సౌజన్య కావూరి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చలన చిత్రం హైదరాబాద్ మణికొండ శివాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కు నూతన కథానాయకుడు రవితేజ మహాదాస్యం పై బేబీ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ నితిన్ రెడ్డి చిమ్ముల, ఎడిటింగ్ : అఖిల్ దేశ్ పాండే , సంభాషణలు, పాటలు జక్కా రాజశేఖర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ మక్కెన విజయ్, తేజస్విని డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. సహా నిర్మాతలు : దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement