Tuesday, May 14, 2024

Padma Vibhushan | ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు పద్మ విభూషణలు !

గ‌న‌తంత్ర దినోత్స‌వం సందర్భంగా పద్మ అవార్డులని నిన్న (గురువారం) సాయంత్రం ప్రకటించింది కేంద్రం. కాగా, దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. తెలుగు సీనియర్ రాజకీయ నాయకులు వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. ఇక‌ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. ఈసందర్భంగా వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే తాజాగా, ఈ ఇద్దరు పద్మ విభూషణులు ఒకేచోట చేరారు. మెగాస్టార్ చిరంజీవి ఇవ్వాల‌ సాయంత్రం వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు. కాగా, ఈ ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement