సాత్విక్ వర్మ, జాక్ రాభిన్ సన్, మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ నటిస్తున్న చిత్రం ‘చిక్లేట్స్’. ముత్తు.యం దర్శకత్వంలో శ్రీనివాసన్ గురు తెలుగు,తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు- చేసింది. ముఖ్య అతిథిగా వచ్చిన హీరో రామ్ కార్తీక్ -టైలర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిక్లెట్స్ -టైలర్ చాలా బాగుంది. ఇప్పు డున్న జనరేషన్ అంతా బాధ్యతగా ఉన్నారు. వారికీ ఏది కావా లి, ఏది వద్దు అనే స్పష్టత ఉంది. పిల్లలకు పేరెంట్స్ కు మంచి సందేశం ఉండేలా తెరకెక్కిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అన్నారు.
దర్శకుడు ముత్తు.యం. మాట్లాడుతూ ”తమిళ్ లో శంకర్ దగ్గర రోబో సినిమాకు , తెలుగులో శ్రీకాంత్ అడ్డాల దగ్గర అసిస్టెంట్గా చేశాను. 90 జనరేషన్, 2కె జనరేషన్ పిల్ల లకు, పేరెంట్స్ కు మధ్య జరుగుతున్నటు-వంటి సంఘర్షణ ఈ సినిమాలో చెప్పడం జరిగింది.” అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ డానియల్ మాట్లాడుతూ ”ఈ సిని మాలో మంచి మెసేజ్ ఉంటు-ంది. చూసిన వారందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది ఆన్నారు. అతిథిగా వచ్చిన దర్శకులు శివం మాట్లాడుతూ -టైలర్ లో చూపించిన నెగిటివ్ థింక్స్ మాత్రమే కాకుండా ఇందులో చాలా పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి.”అన్నారు. నటి మంజీరా రెడ్డి మాట్లాడుతూ ”జీవితంలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి” అన్నారు.
హీరోయిన్ అమీర్తా హాల్దర్ మాట్లాడుతూ ”ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మా తలకు ధన్యవాలు” చెప్పారు.
హీరో సాత్విక్ మాట్లాడుతూ ”తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛను పిల్లలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనేది ఈ సినిమా ఉంటుంది” అన్నారు.