Wednesday, March 27, 2024

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు సమావేశమైన వెరిడ్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి 1 నుంచి 4 వ తేదీ వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 4వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ, మార్చి 6వ తేదీన ఓటర్ లిస్ట్ పై అబ్జెక్షన్స్ ఉంటే చెప్పాలని బోర్డు తెలిపింది.

మార్చి 23వ తేదిన ఫైనల్ ఓటర్ లిస్ట్ ను అధికారులు విడుదల చేయనున్నారు. మార్చి 28, 29 తేదీల్లో నామినేషన్ల ఘ‌ట్టం, మార్చి 29న లిస్టు సిద్దమ‌వుతుంది. ఏప్రిల్ 1వ తేదీ స్క్రూట్నీ, ఏప్రిల్ 6వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రాలు, ఏప్రిల్ 10వ తేదీన సింబల్స్ కేటాయింపు జరుగుతుంది. అనంతరం ఎన్నికల ప్రచారం దాదాపు 20 రోజుల సాగనుంది. ఇక ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు బ్రిగేడియర్ సోమశంకర్ తో పాటు సీఈఓ మధుకర్ నాయక్ లు స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement