Tuesday, May 7, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సాయి ధ‌ర‌మ్ తేజ్ చిత్రానికి బ్రో టైటిల్..!

స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రానికి బ్రో అనే టైటిల్ ని ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నారు. పవన్‌ ఈ సినిమాలో సాయితేజ్‌ను బ్రో అని పిలుస్తాడని.. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే యాక్సిడెంట్‌లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో సాగుతుంది.దాదాపు అటు ఇటుగా ఇలాంటి కథలను మనం చాలా సార్లు చూశాం. అయితే సముద్రఖని తన స్క్రీన్‌ప్లే, టేకింగ్‌తో ప్రేక్షకులను మాయ చేశాడు. తమిళంలో తంబి రామయ్య పోషించిన పాత్రను సాయిధరమ్‌ తేజ్‌ చేస్తున్నాడు. దేవుడిగా పవన్‌ కళ్యాణ్‌ కనిపించనున్నాడు. ఇప్పటికే పవన్‌ షూటింగ్‌ పూర్తయిపోయిందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement