Friday, April 26, 2024

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్త ఎన్నంటే..?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా త‌గ్గుముఖం ప‌ట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా త‌గ్గిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గ‌తంతో పోలిస్తే క‌రోనా వైర‌స్ అదుపులోనే ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌డిచిన‌ 24 గంటల వ్యవధిలో 1,44,767 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,331 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,49,72,800కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,44,18,351 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement