Monday, April 29, 2024

‘డబుల్ ఇస్మార్ట్’ లో బాలీవుడ్ స్టార్.. పెద్ద ప్లానే వేసిన పూరి !

పూరి జగన్నాధ్ – రామ్ పోతినెని కాంబోలో 2019 రిలీజ్ అయిన‌ బ్లాక్‌బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘‘డబుల్ ఇస్మార్ట్’’ ప్రాజెక్ట్ తో మ‌రో సారి చేతులు క‌లిపారు డైరెక్ట‌ర్ పూరి హీరో రామ్ పోతినెని. లైగ‌ర్ ఫ్లాప్ త‌రువాత క‌మ్ బ్యాక్ కోసం చాలా కాలం విరామం తీసుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై చాలా కష్టపడ్డాడు. కాగా, ఇప్ప‌టికే మొద‌లైన ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మూవీ షూటింగ్‌లో ప్రధాన భాగం ముంబైలో జ‌రుగుతోంది. అంతే కాకుండా ఈ మూవీని పాన్-ఇండియా లెవెల్ లో తెర‌కెక్కించాలని మేక‌ర్స్ ట్రై చేస్తున్నారు.

కాగా, తాజా నివేదికల ప్రకారం, పూరి జగన్నాధ్ ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ కూడా ఈ సినిమాకి ఓకే చెప్పిన‌ట్టు సమాచారం. కాగా, దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక‌పోతే ఈ మూవీ 2024 మహా శివరాత్రికి విడుదల చేయ‌నున్నారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement