Monday, April 29, 2024

అప్పుడు భీష్మ వచ్చింది!! లాక్ డౌన్ తెచ్చింది…ఇప్పుడు రంగ్ దే వస్తుంది..ఏం తెస్తుందో !!

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగ్ దే. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మరికొన్ని గంటల్లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ షోలు పడబోతున్నాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది….అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. రంగ దే సినిమా రేపు రిలీజ్ అని తెలియగానే కొంత మంది భయపడుతున్నారు. సినిమా రిలీజ్ కి భయపడడానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? గతేడాది 2020 లో ఇదే సమయానికి భీష్మ సినిమా నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ హిట్ విషయం పక్కన పెడితే ఆ తర్వాత కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా ఎక్కువ అయింది. ఆ వెంటనే లాక్ డౌన్ పడింది.

ఇప్పుడు మళ్లీ అదే సమయానికి…అదే విధంగా కరోనా కేసులు పెరుతున్నాయి. అలాగే…. నితిన్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మరోవైపు లాక్ డౌన్ పెడతారని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ రెండింటినీ ముడిపెడుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో నితిన్ ను ఏకిపారేస్తున్నారు. ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కావాలంటే కలెక్షన్స్ చందా ఏసుకుని ఇంటికి పంపిస్తాము… నువ్వు మాత్రం ఈ టైం లో సినిమా రిలీజ్ లు పెట్టకు…ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఈ సమయంలో రిలీజ్ పెట్టకు అంటూ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరికొంతమంది నితిన్ అన్న సినిమా రిలీజ్ కి కరోనా కి ఏదో అవినాభావ సంబంధం ఉందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement